తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదండాపురంలో రోడ్డు ప్రమాదం... బాలుడి మృతి - Car collided Tractor

ముందు వెళ్తోన్న ట్రాక్టర్​ను కారు ఢీకొట్టిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు

By

Published : May 9, 2020, 8:55 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇటిక్యాల మండలం కోదండాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో కారు, ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందాడు. కడప నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తోన్న కారు కోదండాపురం సమీపంలోకి రాగానే ముందు వెళ్తోన్న ట్రాక్టర్​ను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న కౌశిక్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details