జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడం వల్ల దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు . జూరాల ప్రస్తుత నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.678 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి ఒక లక్ష 48 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. స్పిల్ వే గేట్ల ద్వారా 98 వేలు 668 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు . దీనికి సంబంధించిన పూర్తి వివారాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల - జోగులాంబ గద్వాల జిల్లా
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో జూరాల నిండుకుండలను తలపిస్తుంది. ప్రస్తుతం జూరాల నీటినిల్వ 5.678 టీఎంసీలు ఉంది.

జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల