జూరాల జలాశయానికి పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి శనివారం 5,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. నాలుగు రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలోని ఒక మోటారు పంపును గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆన్ చేసి నీటిని వదిలారు.
జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. జూరాలకు ఇన్ఫ్లో వస్తుండటంతో పంపుల ద్వారా నెట్టెంపాడు పరిధిలోని జలాశయాలను నింపుతామని తెలిపారు.