తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: జోగులాంబలో మూడు తెరాస, ఒకటి కాంగ్రెస్​

జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మూడు తెరాస, ఒకటి కాంగ్రెస్​ ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి.

By

Published : Jan 27, 2020, 7:52 PM IST

trs-won-in-jogulamba-district
బస్తీకా బాద్​షా: జోగులాంబలో మూడు తెరాస, ఒకటి కాంగ్రెస్​

గద్వాల

గద్వాల మున్సిపాలిటీలో తెరాసకు స్పష్టమైన అధిక్యం ఉండటం వల్ల ఛైర్మన్​ పీఠం కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా బీఎస్​ కేశవ్​, వైస్​ ఛైర్మన్​గా బాబర్​ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

అలంపూర్

అలంపూర్​ పురపాలికలో మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా మనోరమ,​ వైస్​ ఛైర్మన్​గా శేఖర్​ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

అయిజ

అయిజ పురపాలికలో మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. తెరాస-6, కాంగ్రెస్-4 ఫార్వర్డ్ బ్లాక్ -10 స్థానాలు గెలుచుకోగా.... ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు తెరాస ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. అయిజ మున్సిపల్ ఛైర్మన్‌గా దేవన్న, వైస్ ఛైర్మన్‌గా నరసింహులు తెరాస అభ్యర్థులు ఎన్నికయ్యారు.

వడ్డేపల్లి

వడ్డేపల్లి పురపాలికలో మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో 10 స్థానాలకు 8 కాంగ్రెస్ గెలుచుకుంది. మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కాంగ్రెస్​ అభ్యర్థి ఆర్​ఎస్​ కరుణ, వైస్​ ఛైర్​పర్సన్​ఘా సుజాత ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

బస్తీకా బాద్​షా: జోగులాంబలో మూడు తెరాస, ఒకటి కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details