తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2020, 7:53 PM IST

ETV Bharat / state

3 రాష్ట్రాలు పర్యటించిన 32 మందికి వైద్య పరీక్షలు

కాశీకి తీర్థయాత్రలకు వెళ్లిన 32 మంది గద్వాల జిల్లా మల్దకల్​ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పది రోజుల కిందట కాశీకి వెళ్లిన వారంతా మూడు రాష్ట్రాలు పర్యటించారని.. ఇవాళ సొంత గ్రామానికి చేరుకున్నారని ఎస్సై ఓబుల్​ రెడ్డి తెలిపారు.

3 రాష్ట్రాలు పర్యటించిన 32 మందికి వైద్య పరీక్షలు
3 రాష్ట్రాలు పర్యటించిన 32 మందికి వైద్య పరీక్షలు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన 32 మంది పది రోజుల కిందట కాశీకి ఒక ప్రైవేట్​ వాహనంలో తీర్థయాత్రకు వెళ్లారు. ఈ పది రోజుల్లో మూడు రాష్ట్రాలు తిరిగి ఇవాళ సొంత గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా వారంతా తీర్థ యాత్రలకు వెళ్లిన విషయం తెలిసింది.

3 రాష్ట్రాలు పర్యటించిన 32 మందికి వైద్య పరీక్షలు

వారిలో కరోనా లక్షణాలు ఉండొచ్చన్న అనుమానంతో గద్వాల ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరికైనా పాజిటివ్​గా నమోదైతే హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని మల్దకల్​ ఎస్సై ఓబుల్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details