జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్లలో ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సాంబార్ గిన్నెలో పడి తీవ్రగాయాలపాలైంది. గ్రామానికి చెందిన శంకరయ్య కూతురు చిన్నారి నందిని ఇంట్లో ఆడుకుంటూ సాంబార్ గిన్నెలో పడిపోయింది. తీవ్రగాయాలపాలైన చిన్నారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆడుకుంటూ వెళ్లి సాంబార్ గిన్నెలో పడిన చిన్నారి
ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి సాంబార్ గిన్నెలో పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా సాతర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆడుకుంటూ వెళ్లి సాంబార్ గిన్నెలో పడిన చిన్నారి
పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:సంక్రాంతి వేళ 4980 ప్రత్యేక బస్సులు