జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అలంపూర్లో సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణలో 12 లక్షల సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేయనున్నట్లు సంపత్కుమార్ తెలిపారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ - signature gathering against agricultural bill
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ రైతుల వద్దకు వెళ్లి సంతకాలను సేకరించారు.
![వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ signature gathering against agricultural bill by congress in alampur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9440704-501-9440704-1604571282230.jpg)
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ
ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని సంపత్కుమార్ ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నవంబర్ నెలాఖరులో రానున్న తుంగభద్ర పుష్కరాల కోసం గద్వాల జిల్లాలో కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా పుష్కరాలకు ఏర్పాటు చేయాలని సంపత్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిఃతుంగభద్ర పుష్కరాలకు చకచకా ఏర్పాట్లు