తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 7:47 PM IST

ETV Bharat / state

'హుజూర్​నగర్​పై ఉన్న ప్రేమ జోగులాంబ జిల్లాపై లేదా?'

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈనెల 8న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి తలపెట్టామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తెలిపారు.  16న ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

కేసీఆర్​పై మండిపడ్డ సంపత్​కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్​కు హుజూర్​నగర్​ రైతులపై ఉన్న ప్రేమ జోగులాంబ గద్వాల జిల్లా రైతులపై లేదన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈనెల 8న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి తలపెట్టామన్నారు. 16న ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 శాతం ఉన్న జీడీపీ.. భాజపా పాలనలో మూడు శాతానికి పడిపోయిందన్నారు.

కేసీఆర్​పై మండిపడ్డ సంపత్​కుమార్

ABOUT THE AUTHOR

...view details