జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఫిర్యాదుల దినం సందర్భంగా రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు సరిగా స్పందించడం లేదంటూ కార్యాలయ ఆవరణలో రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి రైతులకు, అధికారులకు సర్దిచెప్పి ఇరువర్గాలను శాంతింపజేశారు.
గద్వాల కలెక్టరేట్లో రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం