తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 9:51 PM IST

ETV Bharat / state

ఒకే షెడ్డు... ఇద్దరు నేతలు... రెండు సార్లు ప్రారంభం

ప్రారంభించాల్సిన కార్యక్రమం ఒక్కటే... కానీ హాజరవ్వాల్సింది మాత్రం ఇద్దరు నేతలు. ఒకరు సమయానికి వచ్చి మరోకరు రాకపోతే పరిస్థితేంటి..? అచ్చం అలాంటి పరిస్థితే ఎదురైంది జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మానవపాడులో. ఫలితంగా... ఒకే ప్రారంభోత్సవాన్ని ఇద్దరు నేతలు.. రెండు సార్లు చేశారు.

one dump yard opened two times in manavapadu
one dump yard opened two times in manavapadu

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మానవపాడులో రెండున్నర లక్షలతో షెడ్డును నిర్మించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీఎం అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్ సరిత, సర్పంచ్​ గంగుల హైమావతిని ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే అబ్రహం నిర్దేశిత సమయానికి హాజరుకాగా... జడ్పీఛైర్​పర్సన్​ ఆలస్యంగా వచ్చారు.

తనకు అత్యవసర పనులు ఉన్నాయని జడ్పీ ఛైర్​పర్సన్ రాకముందే షెడ్డును ప్రారంభించి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన కాసేపటికే జడ్పీ ఛైర్​పర్సన్ సరిత హాజరై ఎమ్మెల్యే ప్రారంభించిన షెడ్డును మరోసారి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా... తనకు సమాచారం లేకుండా చేపట్టరాదని ఎమ్మెల్యే స్థానిక నేతలకు సూచించారు. ఇద్దరు నేతల మధ్య బేదాభిప్రాయాలు ఉంటే తమ పనులు ఎలా సాగుతాయనే చర్చ అక్కడ జరిగింది.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details