జోగులాంబ గద్వాల జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో ధరూరు, గట్టు, కేటిదొడ్డి, గద్వాల మండలాల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లక్ష 38 వేల 277 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలోని పోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు.
గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - mptc-zptc-polling in gadwal district
రాష్ట్రవ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నిలకు మొదటి విడతలో భాగంగా పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ధరూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు.
![గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3205044-874-3205044-1557138462582.jpg)
గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్