జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిద్ర చేశారు. ఆయన తండ్రి దశదిన కర్మ పూర్తికావడంతో నిద్ర చేయడానికి అలంపూర్ వెళ్లారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధికి బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా మంత్రి చేరుకున్నారు.
అలంపూర్లో కుటుంబ సమేతంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్తలు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి దశదిన కర్మ పూర్తి కావడంతో కుటుంబ సమేతంగా ఆయన అలంపూర్లో నిద్ర చేశారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలంపూర్
గురువారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి:మేడారం చిన జాతరకు పోటెత్తిన భక్తజనం