తెలంగాణ

telangana

By

Published : Oct 9, 2020, 6:29 PM IST

ETV Bharat / state

మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి నిరంజన్​రెడ్డి

జోగలాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటించారు. గోపాల్​ దిన్నెలో ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

minister niranjan reddy distributed bathukamma sarees in gadwala
minister niranjan reddy distributed bathukamma sarees in gadwala

జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ముందుగా ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నె గ్రామంలో మంత్రి పర్యటించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓజాతో కలసి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఎకరా స్థలంలో త్వరితగతిన ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసిన అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాందేవ్ రెడ్డిని మంత్రి అభినందించారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మహిళలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజ్​లో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన ఏర్పాటు చేసిన అలంపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు, నాయకులకు తగు సూచనలు చేశారు.

ఇవీ చూడండి: బంగారం, వెండి కాస్త ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details