తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ బూటకం' - మంద కృష్ణ వ్యాఖ్యలు తాజా వార్త

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఒక బూటకమని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు.

manda-krishna-press-meet-in-jogulamba-gadwal
'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ బూటకం'

By

Published : Dec 18, 2019, 12:14 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్ ఒక బూటకమని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో అన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై నిందితులను చంపించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి లొంగి నిందితులను ఎన్​కౌంటర్ చేయించిందన్నారు. అదే నిందితులలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక్కరు ఉన్న కూడా ఎన్​కౌంటర్​ జరిగి ఉండేది కాదన్నారు.

దిశ మరణానికి ముందు, ఆ తర్వాత ఎన్నో హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఎంత క్రూరమైన హత్యలు చేసిన నిందితులకైనా చట్ట ప్రకారమే న్యాయస్థానంలో శిక్ష విధించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను చట్టసభలలో మెచ్చుకున్నారు. కానీ హాజీపూర్​లో బీసీ వర్గానికి చెందిన ముగ్గురు బాలికలను చంపిన శ్రీనివాస్ రెడ్డిని ఎన్​కౌంటర్​ చేయమని చెప్పాలేదని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం ఈ నెల 23న నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు.

'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ బూటకం'
ఇదీ చూడండి: అనిశాకు చిక్కు ముళ్లు... ఐఎంఎస్ కేసు విచారణ ఆలస్యం

ABOUT THE AUTHOR

...view details