జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అబ్రహం చెక్కులు పంపిణీ చేశారు. పట్టణంలో ఎమ్మార్వో అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. త్వరలో పురపాలిక ఎన్నికల కోడ్ రాబోతున్నందున లబ్దిదారులకు ముందుగానే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూతురి పెళ్లికోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా తెరాస ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని అబ్రహం వివరించారు.
కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ...
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రంహం పాల్గొన్నారు.
KALYANA LAKSHMI CHEQUES DISTRIBUTION IN ALAMPUR