జోగులాంబ గద్వాల జిల్లాలో పియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కల నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు స్థిరంగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 318.340 మీటర్లు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 2 లక్షల 22 వేల క్యూసెక్కులు ఉండగా... దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షలా 18,723 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాలకు జలకళ... అన్నదాతల్లో ఆనందం - JURALA
మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలని తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టులనుంచి కృష్ణమ్మ జూరాలకు పరవళ్లు తొక్కుతోంది. 23 గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి 2,18,723 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
![జూరాలకు జలకళ... అన్నదాతల్లో ఆనందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4034262-855-4034262-1564856039587.jpg)
జూరాలకు జలకళ... అన్నదాతల్లో ఆనదం