తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమావేశం - jogulamba collector meeting with bankers

మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన కలెక్టర్ శ్రుతి ఓఝా తెలిపారు.

jogulamba collector meeting with bankers
కలెక్టరేట్​ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమావేశం

By

Published : Aug 27, 2020, 11:13 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రుతి ఓఝా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు క్రాప్​ లోన్ ఉన్నవారికి కొవిడ్​ వేళ పది శాతం అదనంగా రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం జారీ చేసిందని.. జిల్లాలో చాలా బ్యాంకుల లక్ష్యం మేరకు రుణాలు అందించలేకపోతున్నాయని వాటికి గల కారణాలు ఏంటని జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా బ్యాంకర్లను ప్రశ్నించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించకుండా.. నిర్లక్ష్యం చేయడంపై సమాధానం చెప్పాలని బ్యాంకర్లను నిలదీశారు.

ప్రధానమంత్రి స్వనిధి ద్వారా వీధి వ్యాపారస్థులకు ఇచ్చే రూ. పది వేల రుణాలను వెంటనే అర్హులకు మంజూరు చేయాలని వారిని బ్యాంకర్లను ఆదేశించారు. పైలట్​ ప్రాజెక్టయిన డెయిరీ యూనిట్లు 587 ప్రతిపాదనలు పంపించగా 337 బ్యాంక్ కన్సెంట్ ఇవ్వటం జరిగిందని.. మిగిలిన వాటినీ త్వరలో మంజూరు చేసే విధంగా చూడాలన్నారు. అనంతరం గతేడాది వివిధ పథకాలను లబ్ధిదారులకు అందించటంలో కృషి చేస్తున్న బ్యాంక్ మేనేజర్లను అభినందించారు.

ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details