తెలంగాణ

telangana

ETV Bharat / state

గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం - గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గద్వాల మండలంలోని గోనుపాడు పాలిటెక్నిక్​ కళాశాలలో కౌంటింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

counting arrangements for municipal election in jogulamba gadwal district
గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

By

Published : Jan 24, 2020, 7:53 PM IST

గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గోనుపాడు పాలిటెక్నిక్​ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఐదు కౌంటింగ్​ హాళ్లు, 37 వార్డులకు 37 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 45 మంది కౌంటింగ్​ సూపర్​వైజర్లు, 89 మంది అసిస్టెంట్లు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు లెక్కింపులో పాల్గొననున్నారు.

వెబ్​ క్యాస్టింగ్​, వీడియోగ్రఫీ సమక్షంలో కౌంటింగ్​ నిర్వహించనున్నారు. గద్వాల కౌంటింగ్​ కేంద్రాన్ని జాయింట్​ కలెక్టర్​ నిరంజన్​ పరిశీలించారు.

లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details