తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు పెడతాం.. - updated news on cordon search of police in Durganagar colony

అయిజ పట్టణ కేంద్రంలోని దుర్గానగర్​ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

cordon search of police in Durganagar colony jogulamba gadwal district
దుర్గానగర్​ కాలనీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

By

Published : Feb 28, 2020, 12:15 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ కేంద్రంలోని దుర్గానగర్​ కాలనీలో గద్వాల అడిషనల్ ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు గద్వాల డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. వాహనాలపై అవగాహన లేని మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వకూడదని గ్రామస్థులకు సూచించారు. వాహన తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులపై, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అడిషనల్​ ఎస్పీ కృష్ణ తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీల్లో 75 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

దుర్గానగర్​ కాలనీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి:ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details