జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అబ్రహాం శ్రీకారం చుట్టారు. ఇటిక్యాల మండల పరిధిలోని గొందిమల్ల, ర్యాలంపాడు, వల్లూరు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.