తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 2:24 PM IST

ETV Bharat / state

భాజపా ధర్నా... పోలీసులు, నాయకుల తోపులాట

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ - పులికల్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ భాజపా నాయకులు పాదయాత్ర చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్​కు తరలించారు. పోలీసులు, నేతల మధ్య తోపులాట జరిగింది.

bjp-protest-for-road-construction-in-jogulamba-gadwal-district
భాజపా ధర్నా: పోలీసులు, నాయకుల తోపులాట

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ - పులికల్ మధ్య 9 కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ భాజపా నేతలు పాదయాత్ర చేపట్టారు. ఈ రోడ్డుపై నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని... రహదారి సరిగా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ... తుపత్రాల గ్రామం నుంచి ఐజ వరకు జిల్లా భాజపా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర ఐజ– రాయచూరు జాతీయ రహదారిపై బైఠాయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భాజపా నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకూ వినకపోవడంతో నాయకులను పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో భాజపా నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

ఇదీ చదవండి:విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు

ABOUT THE AUTHOR

...view details