కార్యకర్త హత్యకు నిరసనగా భాజపా ధర్నా - gadwal
మహబూబ్నగర్ జిల్లా డోకూర్ గ్రామంలో భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యకు నిరసనగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

నిరసనగా భాజపా ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లాలోని వైఎస్ఆర్ చౌరస్తాలో భాజపా శ్రేణులు ధర్నా చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని డోకూర్ గ్రామంలో భాజపా కార్యకర్త హత్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. భాజపా నాయకులు గడ్డం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలలో నిరసన వ్యక్తం చేశారు. తెరాస నాయకులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
హత్యకు నిరసనగా భాజపా ధర్నా