తెలంగాణ

telangana

మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచిన నేతలు

By

Published : Jul 24, 2020, 10:52 PM IST

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో తెరాస నాయకులు కేక్​ కట్​ చేసి.. స్వీట్లు పంచారు. ప్రజా నాయకుడు కేటీఆర్​ వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు.

TRS Leaders Distributes Sweets On Ktr Birth day special
మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచిన నేతలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల తెరాస పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మోడెం ఉమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పీటీసీ సి సాయిని విజయ ముత్యం, పీఏసీఎస్​ ఛైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, రేగొండ ఎంపీటీసీ మైస సుమలత బిక్షపతి, పోచంపల్లి ఎంపీటీసీ కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కొడవటంచ ఆలయ మాజీ చైర్మన్ కొల్గూరి రాజేశ్వరరావు, పీఏసీఎస్​ మాజీ ఛైర్మన్ గోపు బిక్షపతి, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details