తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2020, 7:27 AM IST

ETV Bharat / state

భూపాలపల్లిలో తెరాస అభ్యర్థి ఏకగ్రీవం

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు అభ్యర్థి తొట్ల సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు.

trs candidate is unanimous in Bhupalapalli muncipality
భూపాలపల్లిలో తెరాస అభ్యర్థి ఏకగ్రీవం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డును తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఆ వార్డు తెరాస అభ్యర్థి తొట్ల సంపత్ ఏకగ్రీవం అయ్యారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తొట్ల సంపత్​కు మిఠాయి తినిపించి అభినంధనలు తెలియజేశారు.

తన గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. మిగిలిన 29 వార్డులలో తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎమ్మెల్యే దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎన్నికల ఇంఛార్జి గోవింద్ నాయక్, వరంగల్ మహానగర మేయర్ గుండా ప్రకాష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో తెరాస అభ్యర్థి ఏకగ్రీవం

ఇదీ చూడండి : ప్రమాదకరమైన క్యాన్సర్​కు త్వరలో అద్భుతమైన​ చికిత్స​

ABOUT THE AUTHOR

...view details