తెలంగాణ

telangana

ETV Bharat / state

Kaleshwaram: కాళేశ్వరం జలాలు ఎత్తిపోసి చెరువులు నింపేందుకు సమాయత్తం

ప్రవాహాలు మొదలుకాగానే కాళేశ్వరం (Kaleshwaram) జలాలను ఎత్తిపోసి చెరువులు, చెక్ డ్యాంలను నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాళేశ్వరం (Kaleshwaram), ఎస్సారెస్పీ రాడార్ పరిధిలోని మొత్తం పదివేలకు పైగా చెరువులను వీలైనంత ఎక్కువగా నింపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఆయా చెరువుల్లో ఉన్న నీరు, తదితరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

By

Published : Jun 1, 2021, 4:51 AM IST

కాళేశ్వరం
Kaleshwaram

రానున్న వానాకాలంలో చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యాంలను నింపడమే తొలి ప్రాధాన్యతగా భావించాలన్న సీఎం కేసీఆర్ (Cm kcr)... ఆదేశాలతో అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాణహిత నది ప్రవాహం జూన్ 20 తర్వాత ఉద్ధృతంగా మారుతుందని... అప్పుడు వచ్చిన నీటిని వచ్చినట్లే ఎత్తిపోసి కాళేశ్వరం (Kaleshwaram) రాడార్​లో ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాలను నింపుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

సీఎం ఆదేశాలతో...

రూ. 4 వేల కోట్లతో చేపట్టిన చెక్ డ్యాంలలో మొదటి దశను జూన్ 30 వరకు పూర్తి చేసి ఆ తర్వాత నీరు నింపాలని తెలిపారు. ముఖ్యమంత్రి (Cm) ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు కసరత్తు వేగవంతం చేశారు. కాళేశ్వరం (Kaleshwaram)లోకి ప్రవాహాలు ప్రారంభమైన వెంటనే నీటిని ఎత్తిపోసి పరిధిలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలను నింపేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు సహా ఎస్సారెస్పీ పరిధిలోని 4,450 చెరువులను గుర్తించారు. వీటి సామర్థ్యం 44.2 టీఎంసీలు. వీటి సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరంలో వీటిలో 1,205 చెరువులను నింపారు.

10వేల చెరువులు...

కాళేశ్వరం (Kaleshwaram) రాడార్ పరిధిలో గుర్తించిన చెరువులు 5,543 ఉన్నాయి. వీటి సామర్థ్యం 38.5 టీఎంసీలు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నిరుడు ఈ చెరువుల్లో 800 వరకు నింపారు. ఆయా చెరువుల పరిస్థితి, వాటికి నీరు వేళ్లే మార్గాలు, కాల్వలు, వాటి మరమ్మత్తులు తదితర అంశాలపై ఇంజినీర్లు దృష్టి సారించారు. మొత్తంగా కాళేశ్వరం(Kaleshwaram) జలాలతో 10 నుంచి 11 వేల వరకు చెరువులను నింపవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

కార్యాచరణ...

ఆయా చెరువుల్లో ప్రస్తుతం ఎంత మేర నీరు నిల్వ ఉందన్న వివరాలతో పాటు ఇతర అంశాల ఆధారంగా కార్యచరణ రూపొందిస్తున్నారు. వానాకాలంలో మల్లన్నసాగర్, బస్వాపూర్‌కు కాళేశ్వరం (Kaleshwaram) జలాలు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్​ను దశల వారీగా నింపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వచ్చే సీజన్ నాటికి అదనపు టీఎంసీ పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకొంది.

ఇదీ చదవండి :తాళి కట్టి ధైర్యం చెప్పినా.. కాటేసిన కరోనా!

ABOUT THE AUTHOR

...view details