తెలంగాణ

telangana

ETV Bharat / state

కవితక్క సాయంతో తండ్రిని కడసారి చూసుకున్న కొడుకు - CORONA EFFECT

అసలే లాక్​డౌన్​ కాలం... అందులోనూ కొడుకు పొరుగు రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో తండ్రి చనిపోయాడు. తండ్రిని కడసారి చూసుకునేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లగా... అనుమతిప్పించి తండ్రి అంతిమసంస్కారాలు చేసే అవకాశం కల్పించారు.

SON DONE FATHER CREMATION WITH HELP OF EX MP KAVITHA
కవితక్క సాయంతో తండ్రిని కడసారి చూసుకున్న కొడుకు

By

Published : May 3, 2020, 8:39 PM IST

మాజీ ఎంపీ కవిత సాయంతో ఓ కుమారుడు తన తండ్రిని కడసారి చూసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్​కు చెందిన చిలువేరు సాంబయ్య గురువారం రోజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒడిశాలోని భువనేశ్వర్​లో ఉద్యోగం చేస్తోన్న సాంబయ్య కుమారుడు రామకృష్ణ... ఈ విషయాన్ని అక్కడి కలెక్టర్, అధికారులకు విన్నవించాడు. లాక్​డౌన్​ అమల్లో ఉన్న కారణంగా... ఒడిశా అధికారులు రామకృష్ణకు అనుమతివ్వలేదు.

ఈ మేరకు రామకృష్ణ స్నేహితుడు, భూపాలపల్లి టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్​రెడ్డి స్పందించి మాజీ ఎంపీ కవితతో ఫోన్లో మాట్లాడారు. ఒడిస్సా ప్రభుత్వంతో చర్చించిన కవిత రామకృష్ణకు అనుమతి ఇప్పించారు. శనివారం తెల్లవారుజామున రామకృష్ణ స్వగ్రామం చేరుకుని తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. తండ్రి అంతిమ సంస్కారాలు చేయడానికి అనుమతిప్పించిన మాజీ ఎంపీ కవితకు, సహకరించిన మాడ హరీశ్​రెడ్డికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్​ రూపాంతరం చెందుతోందా?

ABOUT THE AUTHOR

...view details