వరదలో చిక్కుకున్న కూలీలు.. రెస్క్యూ టీమ్ పంపిన ఎమ్మెల్యే
12:52 August 17
వరదలో చిక్కుకున్న కూలీలు.. రెస్క్యూ టీమ్ పంపిన ఎమ్మెల్యే
భూపాలపల్లి జిల్లా గుడాడ్పల్లి మండలం ఎస్.యం.కొత్తపల్లిలోని వరదలో ఆరుగురు కూలీలు చిక్కుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న వంతెనను వరద చుట్టుముట్టింది. గుడాడ్పల్లి-ఎస్ఎం కొత్తపల్లి మధ్య వంతెన నిర్మాణ పనుల్లో ఈ కూలీలు పాల్గొన్నారు. నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. ఆ కారణంగా వంతెనపైనే ఆరుగురు కూలీలు ఉండిపోయారు. ఎటూ పోలేక ఫోన్లో పలువురికి సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో రెస్క్యూ టీమ్, బోటును పంపించాలని కోరారు. అధికారులు వరంగల్ నుంచి ఒక బృందాన్ని పంపిస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. సాయంత్రం వరకు వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని గండ్ర పేర్కొన్నారు.
ఇదీ చూడండి :'మెడికల్ హబ్గా హైదరాబాద్ మహానగరం'