తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిమితికి మించి ఇసుక రవాణా.. లారీలు సీజ్ - Jayashankar Bhupalpally District News

భూపాలపల్లి పట్టణంలో బాంబుల గడ్డ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అధిక లోడు గల 6 ఇసుక లారీలను సీజ్ చేశారు. పరిమితికి మించిన లోడుతో పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ హెచ్చరించారు.

పరిమితికి మించి రవాణ.. ఇసుక లారీలు సీజ్
పరిమితికి మించి రవాణ.. ఇసుక లారీలు సీజ్

By

Published : Mar 23, 2021, 7:58 PM IST

Updated : Mar 23, 2021, 10:39 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో అధిక లోడుతో వస్తున్న 6 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. లారీలను మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​కు అప్పగించారు. పరిమితికి మించి ఉన్నాయని స్టేషన్​కు తరలించారు.

డీఎస్పీ ఆదేశాలతో ఎస్సై ఉదయ్ కిరణ్ భూపాలపల్లి బాంబుల గడ్డ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా.. అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. వాటిని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి:'పరిమితికి మించి ఎక్కిస్తే కఠిన చర్యలు'

Last Updated : Mar 23, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details