కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘణపురం చౌరస్తాలో.. ఆల్ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ ధర్నా చేపట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు.
'సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా' - ఆల్ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘణపురం గ్రామంలో .. సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటూ ఆల్ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ మండిపడింది. స్థలాన్ని సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
!['సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా' Occupation of government land in collaboration with the Sarpanch in jayashankar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9988188-765-9988188-1608792094752.jpg)
'సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా'
వార్డు సభ్యులతో మీటింగ్ పెట్టి తీర్మానం చేయకుండా.. సర్పంచ్ ఓ వ్యక్తితో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చాడని పార్టీ నేతలు ఆరోపించారు. అధికారులు తక్షణమే భూమిని సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి'