జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆడపడుచులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కరోనా ప్రభావం ఉన్న చెక్కులు అందించినట్లు గండ్ర పేర్కొన్నారు.
కరోనా ప్రభావం ఉన్నా.. ఆడపడుచులు ఇబ్బంది పడకూడదనే
భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. ఆడపడుచులు అవస్థలు పడకూడదనే పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
కరోనా ప్రభావం ఉన్నా.. ఆడపడుచులు ఇబ్బంది పడకూడదనే
ప్రస్తుతం చెక్కులు అందనివారికి త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, మున్సిపల్ ఛైర్మన్ వెంకట రాణి, వైస్ ఛైర్మన్ హరిబాబు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.