తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి: ఎమ్మెల్యే గండ్ర - తెలంగాణ వార్తలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు.

mla-gandra-venkata-ramana-reddy-launch-pulse-polio-program-at-bhuvanagiri-in-jayashankar-bhupalpally-district
పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి: ఎమ్మెల్యే గండ్ర

By

Published : Jan 31, 2021, 1:39 PM IST

Updated : Jan 31, 2021, 2:41 PM IST

పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని... పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేశారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ వైస్ ఛైర్​పర్సన్, మున్సిపల్ ఛైర్​పర్సన్, వైస్ ఛైర్మన్, యూత్ ప్రెసిడెంట్స్, కౌన్సిలర్లు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కొల్హాపూర్‌ వెళ్తే... కాశీకి వెళ్లినట్లేనట!

Last Updated : Jan 31, 2021, 2:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details