తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2020, 5:30 PM IST

ETV Bharat / state

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సూచించారు. అనంతరం రేగొండ మండలం జడ్పీహెచ్​ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.

mla gandra venkata ramana reddy cycle distribution at zph school in regonda
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని విద్యార్థులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సైకిళ్లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు.

పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతవరణం ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. ఇబ్బందులేమైనా తన దృష్టికి తీసుకువస్తే జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు.

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇవీచూడండి:టోక్యో ఒలింపిక్స్‌కు కరోనా ముప్పు తప్పదా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details