తెలంగాణ

telangana

గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే గండ్ర

By

Published : Feb 15, 2021, 3:04 PM IST

భూపాలపల్లి కేంద్రంలో సంత్​ సేవాలాల్​ మహారాజ్​జయంత్యుత్సవాలు, లారీ అసోసియేషన్​ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్​ క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

mla gandra venkata ramana reddy
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్​ 282వ జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకునే సేవాలాల్​ జయంతి వేడుకలకు హాజరవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. వేడుకలో గిరిజనుల ఆచారాలను పాటించిన ఆయన.. వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం లారీ అసోసియేషన్ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి హాజరై.. క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:'కేసీఆర్​ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు'

ABOUT THE AUTHOR

...view details