తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల సిబ్బంది కోసం తెచ్చిన సామగ్రి అగ్గి పాలు - JAYASHANKER BHUPALAPALLY DISTRICT

జయశంకర్ భూపాల్​ పల్లి జిల్లాలో ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన 5 టెంట్లు, కుర్చీలు కాలి బూడిదయ్యాయి. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

కాలి బూడిదైన 5 టెంట్లు, కుర్చీలు

By

Published : May 6, 2019, 6:13 AM IST

ఎంపీడీవో కార్యాలయం ముందు ఎన్నికల విధుల కోసం ఏర్పాటు చేసిన 5 టెంట్లు, కుర్చీలు దగ్ధమైన సంఘటన జయశంకర్ భూపాల్​ పల్లి జిల్లా గణపురంలో చోటు చేసుకుంది. ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో ద్విచక్ర వాహనం, ఓ కారు స్వల్పంగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది : అధికారులు

ABOUT THE AUTHOR

...view details