తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి - జయశంకర్ భూపాలపల్లి

లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయలయ్యాయి.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

By

Published : Sep 6, 2019, 10:01 AM IST

జయశంకర్ భూపాలపల్లి - హన్మకొండ మార్గంలోని గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి వద్ద నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. భూపాలపల్లికి చెందిన క్రాంతి, రవి ద్విచక్ర వాహనంపై గణపురం వైపు వెళ్తున్నారు. లక్ష్మారెడ్డి పల్లి వద్దుకు రాగానే వేగంగా దూసుకొచ్చిన బూడిద లారీ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో క్రాంతి తలకు తీవ్రగాయమై అక్కడే మృతి చెందాడు. రవి పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరు సింగరేణిలో అటెండర్లుగా పనిచేస్తున్నట్లు ఎస్సై గోవర్దన్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details