తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ... - LORRY AND RTC BUS ACCIDENT

కాళేశ్వరం నుంచి మహాదేవ్​పూర్​కు వెళ్తున్న ఇసుక లారీ... ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా... 10 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

LORRY AND RTC BUS ACCIDENT

By

Published : Jul 26, 2019, 5:41 PM IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్‌ -కాళేశ్వరం రహదారిలో అన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాళేశ్వరం నుంచి మహాదేవ్​పూర్‌కు వెళ్తున్న ఇసుక లారీ... ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుడు చెల్పూరుకు చెందిన పనగంటి సమ్మయ్యగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details