తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 6:45 PM IST

ETV Bharat / state

'రెండు గంటల్లో రెండు లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం కండి'

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న 2 గంటల్లో 2 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీమ్​ ఆదేశించారు.

jayashanker bhupalpally collector review on mass plantation on 10th july
jayashanker bhupalpally collector review on mass plantation on 10th july

ఈనెల 10న జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2 గంటల వ్యవధిలో రోడ్లకు ఇరువైపులా 2 లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఆదేశించారు. సింగరేణి ఇల్లందు క్లబ్​హౌస్​లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మాసివ్ అవెన్యూ ప్లాంటేషన్​పై చర్చించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లాలో 30 నిమిషాల్లో 3 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని చేరటానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలెక్టర్​ అభినందించారు. ఇదేస్ఫూర్తితో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జిల్లాలోని రహదారులకు ఇరువైపులా 2 గంటల వ్యవధిలో 2 లక్షల మొక్కలను నాటాలని కోరారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో ప్రతిరోజు పది లక్షల మొక్కల పంపిణీ జరిగేలా ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున అందించాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో అడివిని తలపించేలా... పల్లె వనాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details