తెలంగాణ

telangana

ETV Bharat / state

విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు..  గండ్ర ఆగ్రహం - ముఖ్యమంత్రి  కేసీఆర్

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించారు. 7 కోట్ల 24 లక్షలతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు..  గండ్ర ఆగ్రహం

By

Published : Nov 9, 2019, 7:49 PM IST

విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు.. గండ్ర ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ ​ ప్రతి గ్రామానికి అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని.. అందరు కలిసికట్టుగా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్​ఎఫ్​ నిధి కింద 12 మంది లబ్ధిదారులకు 2 లక్షల 73 వేల చెక్కుల పంపిణీ చేశారు. ఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో 7 కోట్ల 24 లక్షలతో నిర్మించే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఘనపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే గండ్ర ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా పట్టించుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండ చూసుకోవాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details