పాలనలో పారదర్శకత, వేగం, ఖచ్చితత్వం కోసం ఈ-ఆఫీస్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇకపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ పద్ధతిలోనే పాలన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన కోసం అవసరమైతే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి అధికారి తమ శాఖ నిర్వహిస్తున్న పనుల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటుగా ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించి.. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలన్నారు. పరిష్కారానికి తగు చర్యలు తీసుకొని దరఖాస్తుదారులకు అందించాలని ఆదేశించారు.