తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 7:51 PM IST

ETV Bharat / state

ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ

జయశంకర్‌ భూపాలపల్లి రంగయ్యపల్లిలో విశ్వతేజ ఫౌండేషన్.. మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. చిలువేరు విశ్వతేజ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ
ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో విశ్వతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది నిరుపేద, పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు, ఆశావర్కర్లకు నిత్యావసర సరకులను సర్పంచ్ దగ్గు సంధ్య పంపిణీ చేశారు.

ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలువేరు సంపత్ మాట్లాడుతూ కరోనా నిరుపేదల జీవితాలను కల్లోలం చేసిందని చిలువేరు సంపత్‌ అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతగా నిరుపేద కుటుంబాలకు బియ్యం, నూనె ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిలువేరు విశ్వతేజ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ABOUT THE AUTHOR

...view details