తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2020, 10:47 AM IST

Updated : Sep 2, 2020, 10:59 AM IST

ETV Bharat / state

నీట మునిగిన కాళేశ్వరం పుష్కర ఘాట్​ మెట్లు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్​ మెట్లు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి దాటి ప్రవహిస్తున్నాయి.

KALESWARAM
నీట మునిగిన కాళేశ్వరం పుష్కర ఘాట్​ మెట్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తోన్న వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తుండడం వల్ల కాళేశ్వరం పుష్కర ఘాట్ మెట్లు నీట మునిగాయి.

త్రివేణి సంగమం ఘాట్ వద్ద 12.270 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరంలో.. పూజలు, భక్తుల పుణ్యస్నానాలు నిలిపివేశారు. తీర ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 9,69,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బ్యారేజీలో 85 గేట్లకు గాను 75 గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 8.7 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సరస్వతీ బ్యారేజీకి.. 10,600 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎనిమిది గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని కిందకు విడిచిపెడుతున్నారు.

నీట మునిగిన కాళేశ్వరం పుష్కర ఘాట్​ మెట్లు

ఇవీచూడండి:వరదల్లో చిక్కుకున్న వానరాన్ని కాపాడిన ఎస్​డీఆర్​ఎఫ్​

Last Updated : Sep 2, 2020, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details