కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో తొలి, భారీ నిర్మాణం లక్మి బ్యారేజీ నీటితో కళకళలాడుతోంది. తొలిసారిగా ఏకకాలంలో 11 మోటార్లతో 2టీఎంసీల నీటినీ ఎత్తి పోసే మహా ఘట్టాన్ని ఆవిష్కరించారు. లక్ష్మి బ్యారేజీలో పూర్తి స్థాయి గేట్లు మూసివేయడం... పూర్తిస్థాయి నీటి నిల్వ చేయడం మొదటి సారిగా జరిగింది.
15.90 టీఎంసీలకు నీళ్లు....
గతేడాది నవంబర్ 21 నుంచి పూర్తి స్థాయిలో గేట్లను మూసేశారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... 15.90 టీఎంసీలకు చేరుకుంది. ఏడు మోటార్లు నడిపించి 14 పైపులతో గ్రావిటీ కాలువ ద్వారా జలాలలను ఎత్తిపోశారు. ఒక్కొ పంపును ప్రారంభించి ఒక్కొక్కటిగా పెంచుతూ... 11 పంపులను నడిపించారు. లక్షి పంపుహౌస్లో మొదటి దఫాలో 24 రోజులు, రెండో దఫాలో 39 రోజులు పంపులు నడవగా 37 టీఎంసీల నీటిని తరలించారు.