జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గొర్లవీడు గ్రామంలో దొడ్ల భాను స్థానికంగా నివాసముంటున్నాడు. నిన్న సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నీరు సరిగా రావడంలేదని మోటరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద తల్లి రోదించిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
విద్యుదాఘాతంతో రైతు మృతి