తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ పాసుపుస్తకాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నకిలీ పాసు పుస్తకాలు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Feb 22, 2019, 11:43 PM IST

నకిలీ పాస్ పుస్తకాల ముఠా


నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను భూపాలపల్లి జిల్లాలో పట్టుకున్నారు. చల్లగరిగె గ్రామానికి చెందిన బండిరాజు మరో నలుగురితో కలిసి ఎమ్మార్వో, ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. రైతుల వద్ద కమిషన్​ తీసుకుని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు తనిఖీలు చేసి నకిలీ పాసు పుస్తకాలు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని హన్మకొండలోని లలిత ప్రింటింగ్ ప్రెస్​లో తయారు చేసినట్లు గుర్తించారు.

నకిలీ పాస్ పుస్తకాల ముఠా

ABOUT THE AUTHOR

...view details