జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీపీఎస్ ఉపాధ్యాయుడు కొడారి తిరుపతి కుటుంబాన్ని తాము ఆదుకుంటామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్ధన్రెడ్డి, రఘోత్తం రెడ్డి అన్నారు. జిల్లా టీచర్లు విరాళాల ద్వారా సేకరించిన రూ. 1,25,000ను తిరుపతి కుటుంబ సభ్యులకు అందజేశారు.
కొడారి తిరుపతి.. తెలుగు టీచర్గా వైన్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసేవారు. అనారోగ్యంతో ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు.. శనివారం సాయంత్రం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) కింద ఉన్న తిరుపతికి ఉద్యోగ పరంగా ఎలాంటి ప్రయోజనాలు రావని జనార్ధన్రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆయన కుటుంబాన్ని తమ సంఘం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.