తెలంగాణ

telangana

ETV Bharat / state

'యువతపై మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా చర్యలు చేపట్టాలి' - Jayashankar Bhupalpally District Latest News

జయశంకర్ భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లాలో వాటి ప్రభావం లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. దాని వల్ల కలిగే అనర్థాలు ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణపై జాంయింట్ కలెక్టర్ స్వర్ణలత సమావేశం
మాదకద్రవ్యాల నియంత్రణపై జాంయింట్ కలెక్టర్ స్వర్ణలత సమావేశం

By

Published : Mar 15, 2021, 5:21 PM IST

జయశంకర్ భూపాలపల్లిలో యువతపై మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసే అవకాశాలున్నందున స్థానిక రెవెన్యూ అధికారుల సమన్వయంతో దాన్ని అడ్డుకోవాలని సూచించారు.

ప్రభావం లేదు..

జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లాలో వాటి ప్రభావం అంతగా లేదని అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అక్రమంగా రవాణా జరిగే గంజాయిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు.

విస్తృత ప్రచారం..

గంజాయి సాగుపై ఎలాంటి సమాచారం లేదని.. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు ప్రజలకు తెలిసేలా పలు మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్ రావు, బోనాల కిషన్, డ్రగ్ ఇన్​స్పెక్టర్ రవికిరణ్ రెడ్డి, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రామోజీ ఫౌండేషన్​ సహకారంతో నాగన్​పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం

ABOUT THE AUTHOR

...view details