జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. గోదావరి ఘాట్కు వెళ్లి... గోదావరి-ప్రాణహిత గంగా పవిత్ర జలాలను తలమీద చల్లుకున్నారు. అనంతరం నీటిలో నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించి జల నీరాజనాలు అర్పించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.