తెలంగాణ

telangana

ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

By

Published : Feb 13, 2020, 1:44 PM IST

ముక్తేశ్వరస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబటిపల్లి సమీపంలోని లక్ష్మీ బ్యారేజీను సందర్శించనున్నారు.

cm kcr visits kaleshwaram temple
కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. గోదావరి ఘాట్‌కు వెళ్లి... గోదావరి-ప్రాణహిత గంగా పవిత్ర జలాలను తలమీద చల్లుకున్నారు. అనంతరం నీటిలో నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించి జల నీరాజనాలు అర్పించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details