తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2019, 5:16 AM IST

Updated : Aug 6, 2019, 9:47 AM IST

ETV Bharat / state

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్​ కాళేశ్వరం పర్యటన

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత జలాలు ఎత్తిపోయడం వల్ల మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా మారింది. ఈ జలకళను వీక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్​ కాళేశ్వరం పర్యటన

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్​ కాళేశ్వరం పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో సీఎం​, మరో హెలికాప్టర్​లో మంత్రి ఈటల, ఇతర అధికారులు, ఇంజినీర్లు పయనమవుతారు.

కేసీఆర్... విహంగ వీక్షణం

ఉదయం 10.50 గంటలకు సీఎం కేసీఆర్​ మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 140 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం ఇతర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా తిలకిస్తారు. గోలివాడ పంపుహౌస్​ చేరుకుని ఎల్లంపల్లి బ్యారేజీని పరిశీలిస్తారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటలకు గోలివాడ నుంచి ధర్మపురికి చేరుకుంటారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని 3 గంటలకు తిరిగి హైదరాబాద్​కు పయనమవుతారు.

Last Updated : Aug 6, 2019, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details