జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, చిట్యాల మండలాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నైన్ పాక, చల్లగారిగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా… విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చెట్టు కూలడంతో దుక్కిటెద్దు మృతి - చెట్టు నేలకూలడంతో దుక్కిటెద్దు మృతి
ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం పలు చోట్ల నష్టాలను తెచ్చిపెడుతోంది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా.. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
![చెట్టు కూలడంతో దుక్కిటెద్దు మృతి bull dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7069532-847-7069532-1588672801866.jpg)
చెట్టు కూలడంతో దుక్కిటెద్దు మృతి
చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో వర్షానికి చెట్టు నేలకూలడంతో దుక్కిటెద్దు మృతి చెందింది. భూపాలపల్లి, ఘనపూర్, టేకుమాట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ