తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

లోక్​సభకు ఎన్నికల వేళ ఓటుహక్కుపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. భూపాలపల్లిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతీ ఓటు రసీదును వీవీప్యాట్​ ద్వారా సరిచూసుకోవాలి : ఆర్డీవో

By

Published : Mar 26, 2019, 9:24 PM IST

ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరు గురించి విద్యార్థినులకు అవగాహన సదస్సు
ఎన్నికల్లో వేసిన ప్రతీ ఓటు రసీదును వీవీప్యాట్​ ద్వారా సరిచూసుకోవాలని భూపాలపల్లి ఆర్డీవో సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు, ఈవీఎంలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వాసవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి విశేష స్పందన లభించింది.

తమ కళాశాల వద్దకే వచ్చి ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరు గురించి వివరించడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం నమోదు కావాలి :ఆర్డీవో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం ఓట్లు పోలయ్యాయని ఆర్డీవో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించి నమోదు కావాలని అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో యువత ముందంజలో ఉంటూ తల్లిదండ్రులకు ఓటు విలువ గురించి తెలియజేయాలని కోరారు.

ఇవీ చూడండి :చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..!

ABOUT THE AUTHOR

...view details